Wednesday, July 18, 2018

రఘువంశమ్-1.95


శ్లోకః
నిర్దిష్టాం కులపతినా స పర్ణశాలాం
అధ్యాస్య ప్రయతపరిగ్రహద్వితీయః ।
తచ్ఛిష్యాధ్యయననివేదితావసానాం
సంవిష్టః కుశశయనే నిశాం నినాయ ॥1.95

పదవిభాగః
నిర్దిష్టాం కుల-పతినా స పర్ణ-శాలామ్ అధ్యాస్య ప్రయత-పరిగ్రహ-ద్వితీయః । తత్-శిష్య-అధ్యయన-నివేదిత-అవసానాం సంవిష్టః కుశ-శయనే నిశాం నినాయ

అన్వయః
ప్రయతపరిగ్రహద్వితీయః సః (రాజా) కులపతినా (వశిష్ఠేన) నిర్దిష్టాం పర్ణశాలామ్ అధ్యాస్య కుశశయనే సంవిష్టః (సన్) తత్ శిష్యాధ్యయన-నివేదితావసానాం నిశాం నినాయ 1.95

వాచ్యపరివర్తనమ్
ప్రయతపరిగ్రహ-ద్వితీయేన తేన (రాజ్ఞా) కులపతినా నిర్దిష్టాం పర్ణశాలామ్ అధ్యాస్య కుశశయనే సంవిష్టేన (సతా) తచ్ఛిష్యాధ్యయన-నివేదితావసానా నిశా నిన్యే

సరలార్థః
ఋషికులాచార్యేణ బ్రహ్మర్షిణా వశిష్ఠేన నిర్దిష్టే పర్ణకుటీరే స దిలీపః జితేన్ద్రియయా సుదక్షిణయా సహ దర్భశయ్యాయాం సుష్వాప, వశిష్ఠశిష్యాణాం వేదాధ్యయనశబ్దేన క్షపావసానం జ్ఞాత్వా శయనాత్ ఉత్తస్థౌ
          మునీనాం దశసాహస్రం యోఽన్నదానాదిపోషణాత్ అధ్యాపయతి విప్రర్షిరసౌ కులపతిః స్మృతఃఇతి కులపతేః పురాణోక్తలక్షణమ్.

తాత్పర్యమ్
ఇంద్రియసంయమనశీలినియైన భార్యతో కలిసి అతడు, కులపతియైన వశిష్ఠుడు సూచించిన కుటీరానికి వెళ్ళి, దర్భశయ్యపై శయనించి - ఆయన (వశిష్ఠుడి) శిష్యుల వేదాధ్యయనశబ్దంతో ముగిసిన - ఆ రాత్రిని గడిపాడు (శిష్యుల వేదాధ్యయనశబ్దంతో తెల్లవారింది అని భావము).

[కులపతి = పదివేల మంది మునులకు అన్నదానాదిపోషణము చేసి విద్యను బోధించే విప్ర-ఋషి అని పురాణాలు చెబుతున్నాయి;
ఆం.ప్ర.సాహిత్య అకాడెమీ ముద్రణలో ఈ క్రింది అదనపు వివరణము ఉన్నది:
పూర్వకాలమున శిష్యులు అపరరాత్రమునందే వేదమును కంఠస్థము చేసెడువారు. అట్లు చేయవలయునని ధర్మశాస్త్రము. నిశాంతే న పరిశ్రాంతో బ్రహ్మాధీత్య పునః స్వపేత్అని మనువు; “నచాపరరాత్రమధీత్య పునః స్వపేత్అని గౌతముడు. (తెల్లవారుజామున చదువుకొని మరల నిద్రింపరాదు; ఒకవేళ ఎక్కువగా అలసిపోయినచో మళ్ళీ నిద్రింపవచ్చును.”)]

No comments:

Post a Comment